ఏపీలో టీడీపీదే విజయం

Update: 2017-07-15 01:52 GMT

ఆంధ్రప్రదేశ్ జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ఎంపీపీ, కృష్ణా జిల్లా ముసునూరు ఎంపీపీ, అనంతపురం జిల్లాల్లో మూడు, విశాఖపట్నం జిల్లాల్లో రెండు ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం మాత్రం వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

Similar News