ఏపీలో ఐసిస్ కార్యకలాపాలు : చంద్రబాబు

Update: 2017-01-09 21:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఐసిస్ కార్యకలాపాలు చాపకిందనీరులా సాగుతున్నాయా? అవుననే అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా ఈ విషయాన్ని తెలిపారు ముఖ్యమంత్రి. ఐసిస్ కార్యకలాపాలు అదుపు చేసేందుకు తమకు అదనంగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. లేకుంటే ఐసిస్ కార్యకలాపాలు పెరిగే అవకాశముందన్నారు చంద్రబాబు. గ్రేహౌండ్స్, కేంద్రబలగాలను పంపాలని కేంద్రహోంమంత్రిని కోరారు.

పెద్దనోట్ల రద్దుతో అవినీతి అంతమయిందన్నారు చంద్రబాబు. నల్లధనం వెలికితీసిన ఘనత మోడీదేనన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని చెప్పింది తానేనన్నారు. ప్రజలకు డబ్బు ఇచ్చి గెలిస్తే వారు ఏం ప్రజాసేవ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నకల్లో ఖర్చు చేసి ఓట్లు వేయించుకున్న వారు సమాజానికి ప్రమాదం చేస్తారని చంద్రబాబు అన్నారు.

Similar News