ఏపీ సచివాలయంలో తెలంగాణ మంత్రి

Update: 2017-06-09 13:46 GMT

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఇటీవల వర్షాలకు నీళ్లొచ్చిన ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ ను కూడా ఈటల పరిశీలించారు. ఏపీ తాత్కాలిక అసెంబ్లీ బాగుందని ఈటల కితాబిచ్చారు. తన కుమారుడి వివాహ శుభలేఖలను ఏపీ మంత్రులకు అందజేయడానికి ఈటల ఈరోజు బెజవాడ వచ్చారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తర్వాత వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించి ఏపీ మంత్రులను కూడా వివాహానికి ఆహ్వానించారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనిస్తుందని ఈటల ప్రశంసించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News