ఏపీ సచివాలయంలో ఆత్మహత్య

Update: 2017-08-19 07:01 GMT

ఏపీ సచివాలయంలో ప్రైవేటు వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాకాల పల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు గండికోట రాజగోపాల్ ఆర్ధిక సమస్యలతో బాధపడుతూ సాయం కోసం వెలగపూడి వచ్చారు. శుక్రవారం సాయంత్రం వరకు ఎదురు చూసినా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడంతో వెంట తెచ్చకున్న పురుగుల మందు తాగాడు. నురగలు కక్కుకుంటూ సిఎం బ్లాక్‌ వద్ద పడిపోవడంతో సచివాలయ సిబ్బంది గుంటూరు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News