అమరావతిలో తొలి వర్శిటీ ప్రారంభం

Update: 2017-07-15 14:09 GMT

ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ అమరావతి క్యాంపస్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు., కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు యూనివర్శిటీని ప్రారంభించారు. గత ఏడాది భూమి కేటాయించిన తర్వాత ఐదు నెలల వ్యవధిలోనే భవనాలను నిర్మించి తరగతులు ప్రారంభించారు. ఏపీలో తొలి ప్రైవేట్‌ యూనివర్శిటీలో కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆగష్టు 7 నుంచి తొలి బ్యాచ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి ఏడాది 240మంది విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించనున్నారు. మంగళగిరిలోని నీరుకొండ వద్ద 200 ఎకరాల్లో అమరావతి ఎస్‌ఆర్‌ఎం క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు.

Similar News