అతిగా మద్యం సేవించి పట్టుబడ్డ యాంకర్

Update: 2018-01-01 02:23 GMT

నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 45 వద్ద ప్రదీప్ కారును ఆపిన పోలీసులు బ్రీత్ ఎనలైజ్ చేయగా 178 పాయింట్లు నమోదు కావడంతో ఆయనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రదీప్ మాత్రం జరిమానా చెల్లించి వెళ్లిపోయారు. కొత్త చట్టం ప్రకారం ప్రదీప్ శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి నుంచి వేల సంఖ్యలో యువకులు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో దొరికిపోయారు. దాదాపు 1200 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Similar News