కొత్తవారు వస్తున్నారని పాతోళ్లకు బాధొద్దు

పార్టీలోకి అనేక మంది కొత్త వారు వస్తారని, వారి గురించి పాత నేతలకు బెంగ వద్దని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న [more]

Update: 2021-08-06 03:50 GMT

పార్టీలోకి అనేక మంది కొత్త వారు వస్తారని, వారి గురించి పాత నేతలకు బెంగ వద్దని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న పాతవారందరూ తన గుండెల్లో ఉన్నారని వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వచ్చే నెల 5వ తేదీ వరకూ ఊరూరా జెండా పండగను నిర్వహించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ ను అభిమానించే వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, అసంతృప్తులు వదిలి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని వైఎస్ షర్మిల తెలిపారు.

Tags:    

Similar News