సీబీఐ విచార‌ణ‌కు వైసీపీ డిమాండ్‌

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై సీబీఐ లేదా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ నేత మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ… జ‌మ్మ‌లమ‌డుగు [more]

Update: 2019-03-15 11:25 GMT

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై సీబీఐ లేదా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ నేత మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ… జ‌మ్మ‌లమ‌డుగు ఇంఛార్జిగా వివేకానంద‌రెడ్డి ఉన్నార‌ని, ఆయ‌న హ‌త్య‌పై అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ఈ హ‌త్య వెనుక మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి హ‌స్తం ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. పైకి అభివృద్ధి వాదిగా చెప్పుకునే చంద్ర‌బాబుకు హ‌త్యారాజ‌కీయాలు చేయ‌డం కొత్తేమీ కాద‌న్నారు. స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో ఈ కేసును విచారించి నిజాల‌ను నిగ్గు తేల్చాల‌న్నారు.

Tags:    

Similar News