పవన్ రివర్స్ కావడంతో బాబు ప్లేట్ మార్చారు

పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ అర్రులు చాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ… చంద్రబాబుతో భేటీ తర్వాత టీజీ [more]

Update: 2019-01-23 10:47 GMT

పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ అర్రులు చాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ… చంద్రబాబుతో భేటీ తర్వాత టీజీ వెంకటేష్ బయటకు వచ్చి జనసేనతో టీడీపీ కలిసే అవకాశం ఉందని చెప్పారని, చంద్రబాబుతో చర్చించాక ఈ మాటలు చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ రివర్స్ అయ్యి విమర్శించడంతో చంద్రబాబు నాయుడు కూడా ప్లేటు మార్చి అసహనం పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఎవరితో కలిసినా తమకు వచ్చే నష్టమేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రం వైసీపీదేనని పేర్కొన్నారు.

Tags:    

Similar News