అత్యధిక వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ వార్డులను గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 671 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో [more]

Update: 2021-03-05 01:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ వార్డులను గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 671 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 570 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీ ఆరు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయింది. బీజేపీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరొక చోట విజయం సాధించారు. దాదాపు ఆరు మున్సిపాలిటీలు వైసీపీ సొంతమయ్యాయి. ఈ నెల 10వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News