Badvel : బద్వేలులో ఖచ్చితంగా అన్ని ఓట్లు వస్తాయట

బద్వేలు ఉప ఎన్నికకు రేపు కౌంటింగ్ జరగనుంది. బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయం. అయితే మెజారిటీపైనే వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. లక్ష [more]

Update: 2021-11-01 06:59 GMT

బద్వేలు ఉప ఎన్నికకు రేపు కౌంటింగ్ జరగనుంది. బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయం. అయితే మెజారిటీపైనే వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. లక్ష మెజారిటీ వస్తుందన్న అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారు. పోలింగ్ శాతం గత ఎన్నిక కంటే తక్కువగా నమోదు కావడంతో ఎనభై వేలకు పైగానే మెజారిటీ వస్తుందన్న అంచనాకు వచ్చారు. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ సంక్షేమ పథకాలను చూసి జనం వైసీపీకి గంపగుత్తగా ఓట్లేశారంటున్నారు.

బీజేపీ కూడా…..

మరోవైపు బీజేపీ కూడా ఆశలు పెద్దగానే పెట్టుకుంది. కనీసం ముప్ఫయివేల ఓట్లకు పైగానే బీజేపీ అభ్యర్థి సాధిస్తాడన్న నమ్మకాన్ని ఆ పార్టీనేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. బీజేపీకి బద్వేలులో ఓటు బ్యాంకు లేకపోయినా టీడీపీ, జనసేన ఓట్లు తమకు పోలయ్యాయని భావిస్తుంది. మరికొద్ది గంటల్లో వైసీపీ అభ్యర్థి మెజారిటీ ఎంతనేది తేలిపోనుంది.

Tags:    

Similar News