వైసీపీకి ఆ 8 మంది రాజీనామా చేస్తారా?

Update: 2018-08-01 04:07 GMT

నూజివీడు వైసీపీలో ముసలం పుట్టింది. నూజివీడు వైసీపీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మున్సిపల్ ఛైర్మన్ సీటు ఒప్పందంపై వైసీపీలో విభేదాలు వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ కు త్రివేణికి మూడేల్లు, రేవతికి రెండేళ్లు పదవీకాలం చేయాలని ఒప్పందం కుదిరింది. అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుత ఛైర్మన్ రాజీనామా చేయకపోవడంతో ఎనిమిది మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో నూజివీడు వైసీపీలో కలకలం బయలుదేరింది. వైసీపీ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News