చంద్రబాబుకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

హరికృష్ణ పార్ధీవదేహాన్ని పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ తో కలిసేందుకు చర్చలు జరిపిన చంద్రబాబులా నీచ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2019-02-25 08:14 GMT

హరికృష్ణ పార్ధీవదేహాన్ని పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ తో కలిసేందుకు చర్చలు జరిపిన చంద్రబాబులా నీచ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు వారు ఏం చేశారో చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని, నిరాధాల ఆరోపణలు చేయవద్దని కోరారు. ఏదైనా పార్టీతో కలవాలంటే తాము చెప్పి చేస్తాము కానీ దొడ్డి దారిన రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ కాదన్నారు. టీఆర్ఎస్ తో తమకేమీ సంబంధాలు లేవని, ఆ అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నవారిని బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. హైదరాబాద్ లో చంద్రబాబుకు, సుజనా చౌదరి వంటి వారికి ఆస్తులు లేవా అని ప్రశ్నించారు. ఇవాళ వైసీపీ కార్యాలయంలో ఆనం రాంనారాయణరెడ్డితో కలిసి వైసీపీ ప్రచార పాటను వారు ఆవిష్కరించారు.

Tags:    

Similar News