పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలింపు: వైసీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి [more]

Update: 2019-03-28 07:06 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ ను ఎన్నికలు అయ్యే వరకు విధుల నుంచి తొలగించాలని కోరారు. కొందరు ఐపీఎస్ అధికారులు చంద్రబాబు కనసన్నల్లో పనిచేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు వాహనాల్లోనే టీడీపీ డబ్బు తరలిస్తుందన్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును కొనసాగిస్తూ ఏపీ సర్కార్ జీఓ ఇచ్చిన విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News