సీబీఐ అధికారులను కలిసిన సునీత తనకున్న అనుమానాలను?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈరోజు కూడా పులివెందుల చెరువులో ఆయుధాల కోసం గాలించనున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ [more]

Update: 2021-08-09 02:15 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈరోజు కూడా పులివెందుల చెరువులో ఆయుధాల కోసం గాలించనున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ ను సీీబీఐ అరెస్ట్ చేసింది. సునీల్ ఇచ్చిన సమాచారం మేరకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో సీబీఐ అధికారులు ఉన్నారు. అయితే నిన్న సీబీఐ అధికారులను వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ కలిశారు. తమకు ఉన్న అనుమానాలను సీబీఐ అధికారుల ముందు ఉంచారు. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంటమనిషి లక్ష్మమ్మ, ప్రకాష్ రెడ్డిలను వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ అధికారులు విచారించారు.

Tags:    

Similar News