విజయమ్మ ఏం చెప్పనున్నారు..?

Update: 2018-11-10 10:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత తొలిసారి ఆయన కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడనున్నారు. గత నెల 25న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగింది. అయితే, ఈ దాడిపై జగన్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దాడి జగనే చేయించుకున్నాడని, విజయమ్మ, షర్మిల చేయించారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.

రేపు జగన్ బయలుదేరుతుండటంతో....

అయినా వారు ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. కాగా, రేపు సాయంత్రం జగన్ విజయనగరం జిల్లాలో పాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఈ మేరకు ఆయన తల్లి వై.ఎస్. విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. జరిగిన దాడి, ఆ తర్వాత జగన్ కు అందిన చికిత్స, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై విజయమ్మ స్పందించనున్నారు.

Similar News