Ys sharmila : భావోద్వేగానికి గురైన షర్మిల

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రేపటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. [more]

Update: 2021-10-19 08:42 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రేపటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు నాలుగువేల కిలోమీటర్లకు పైగానే 90 నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు షర్మిల ప్రజాప్రస్థానం అని తన తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రకు గుర్తుగా పెట్టుకున్నారు. వైఎస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు.

Tags:    

Similar News