మోడీతో నేడు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశముంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్ ఈరోజు [more]

Update: 2019-10-05 03:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశముంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్ ఈరోజు మూడోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయనున్న రైతు భరోసా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయించారు.

Tags:    

Similar News