అమ్ముడుపోయిన మీడియానే నమ్ముకున్నారు

చంద్రబాబు హయాంలో పింఛన్ల కోసం కేవలం 500కోట్లు మాత్రమే వెచ్చించారని, తాము అధికారంలోకి వచ్చాక 1,500 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. చంద్రబాబు మోసాలు ఆంధ్రజ్యోతి, [more]

Update: 2020-12-04 05:51 GMT

చంద్రబాబు హయాంలో పింఛన్ల కోసం కేవలం 500కోట్లు మాత్రమే వెచ్చించారని, తాము అధికారంలోకి వచ్చాక 1,500 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. చంద్రబాబు మోసాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5లకు కన్పించడం లేదా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే అసత్యాలను వాళ్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ పత్రికలు చదివితే ఏదైనా మంచి జరుగుతుందా? అని జగన్ ప్రశ్నించారు. అమ్ముడుపోయిన మీడియాను నమ్ముకుని చంద్రబాబు ఏపీలో రాజకీయం చేయాలనుకుంటున్నారన్నారు. జులై 8వ తేదీన పింఛను మొత్తాన్ని 2,500లకు పెంచబోతున్నామని జగన్ వెల్లడించారు. ప్రతి జులై 8వ తేదీన 250లు పెంచుతామని జగన్ తెలిపారు. తాను మ్యానిఫేస్టోలో చెప్పినట్లే చేస్తున్నానని అన్నారు.

Tags:    

Similar News