ఈ నెల 23వ తేదీన తిరుమలకు వైఎస్ జగన్

ఈ నెల 23వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్నట్లు తెలిసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన తిరుమలకు రానున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు [more]

Update: 2020-09-12 03:04 GMT

ఈ నెల 23వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్నట్లు తెలిసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన తిరుమలకు రానున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కరోనా కారణంగా భక్తులు లేకుండానే ఏకాంతంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో సంప్రదాయాన్ని పాటిస్తూ వైఎస్ జగన్ ఈ నెల 23న తిరుమల చేరుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News