ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బీహార్ సీఎం ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమకు సహకరించాలని కోరారు. రాజ్యసభ డిప్యూటీ [more]

Update: 2020-09-11 03:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమకు సహకరించాలని కోరారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీఏ తరుపున జేడీయూ నేత హరివంశ్ నారాయణసింగ్ పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే నితీష్ కుమార్ జగన్ కు ఫోన్ చేసి మద్దతివ్వాల్సిందిగా ముందుగానే కోరారు. రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉండటంతో వైసీపీ కీలకంగా మారనుంది.

Tags:    

Similar News