మహిళల కోసం మరో కార్యక్రమం

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భాంగా ఈ రక్షా బంధన్ లోగోను జగన్ ఆవిష్కరించారు. ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని [more]

Update: 2020-08-03 07:45 GMT

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భాంగా ఈ రక్షా బంధన్ లోగోను జగన్ ఆవిష్కరించారు. ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. సైబర్ నేరాలు, రక్షణపై నెల రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దిశ చట్టాన్ని ఒక వారంలోనే అమలులోకి తెచ్చామని చెప్పారు. ఈ రక్షాబంధన్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని, షార్ట్ ఫిల్మ్ లు, యానిమేషన్ లతో మహిళల్లో అవగాహన పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News