కోవిడ్ ను ఖచ్చితంగా ఎదుర్కొంటాం

కరోనాను ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా [more]

Update: 2020-05-05 08:14 GMT

కరోనాను ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఇక్కడ కోవిడ్ ను నియంత్రిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని అన్నారు. కేసుల సంఖ్య పెరగడాన్ని చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్లతో పాటు మొత్తం యంత్రాంగం కరోనా కట్టడిలో పనిచేస్తుందన్నారు. కంటెయిన్ మెంట్ జోన్ లో మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో వ్యాపార కార్యక్రమాలు ప్రారంభయినప్పటికీ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని జగన్ కలెక్టర్లను కోరారు.

Tags:    

Similar News