ఇక తప్పదు… ఆర్డినెన్స్ ద్వారానే?

ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదించుకోవల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిపే పరిస్థితులు ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి లేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో బడ్జెట్ [more]

Update: 2020-03-26 01:46 GMT

ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదించుకోవల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిపే పరిస్థితులు ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి లేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో బడ్జెట్ సమావేశాలను జరిపేందుకు జగన్ ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఏడాది రానున్న మూడు నెలల కాలానికి ఆర్డినెన్స్ తేవాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో కేబినెట్ సమావేశం నిర్వహించి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ను జారీ చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సయితం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పట్ల విముఖత చూపించారు.

Tags:    

Similar News