Ys jagan : సస్పెన్స్ కు నేడు తెర… ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. [more]

Update: 2021-11-10 03:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ ముగ్గురి పేర్లను ఈరోజు ప్రకటించే అవకాశముంది. దీంతో పాటు మరో 11 స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

ముగ్గురి పేర్లను…

ఈరోజు మాత్రం ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పోస్టులకు అభ్యర్థులను జగన్ ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ముగ్గురి పేర్లను జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. గోవిందరెడ్డితో పాటు మరో ఇద్దరు ఎవరన్నది సస్పెన్స్ గా ఉంది. నేడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. సాయంత్రానికి జగన్ నిర్ణయం ఫైనల్ అయితే 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News