Ys jagan : స్టేట్ గెస్ట్ హౌస్ లో జగన్ ను కలిసి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ కు చేరుకున్నారు. ఆయన భువనేశ్వర్ స్టేట్ గెస్ట్ హౌస్ లో కొద్ది సేపు బస చేశారు. ఈ సందర్భంగా సీఎం [more]

Update: 2021-11-09 12:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ కు చేరుకున్నారు. ఆయన భువనేశ్వర్ స్టేట్ గెస్ట్ హౌస్ లో కొద్ది సేపు బస చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జగన్ ను అభినందించారు. ఒడిశాలో తమకు ఉన్న సమస్యలను జగన్ కు వివరించారు. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు ఒడిశాలోని తెలుగు వారు పోటీ పడ్డారు.

నవీన్ ను కలసి….

మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. ఆయనను కలసి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరపనున్నారు. దశాబ్దాల కాలం నుంచి పరిష్కారం కాని నదీ జలాల సమస్యలకు జగన్ తన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News