Ys jagan : సాయంత్రానికి జాబితా ఖరారు

ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కానున్నారు. ఈ నెల 16వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు [more]

Update: 2021-11-09 05:42 GMT

ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కానున్నారు. ఈ నెల 16వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. అయితే ఆ ముగ్గురి పేర్లను జగన్ ఈ సాయంత్రం ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జగన్ ఒడిశా పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత సాయంత్రం అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారంటున్నారు.

మూడు ప్రాంతాలకు…

ముగ్గురిలో బద్వేలు నియోజకవర్గ నేత గోవింద రెడ్డి ఒకరున్నారు. ఈయనకు మరోసారి జగన్ రెన్యువల్ చేసే అవకాశముందంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఉత్తరాంధ్ర, మరొకరు కోస్తాంధ్ర నుంచి ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News