గత ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం ఇదే

అగ్రిగోల్డ్ లో ఉన్న ప్రజల సొమ్మును కొందరు కాజేయాలని చూశారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఒక ప్రయివేటు సంస్థ డబ్బులు ఎగ్గొడితే బాధితులకు ప్రభుత్వం [more]

Update: 2021-08-24 07:08 GMT

అగ్రిగోల్డ్ లో ఉన్న ప్రజల సొమ్మును కొందరు కాజేయాలని చూశారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఒక ప్రయివేటు సంస్థ డబ్బులు ఎగ్గొడితే బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడిందని జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల ప్రయోజనం కోసమే ఈ మోసం జరిగిందని జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని కొందరు అప్పట్లో ప్రయత్నించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అతిపెద్ద స్కాం ఇది అని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జగన్ 666 కోట్ల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Tags:    

Similar News