వాలంటీర్లకు సత్కారం… నగదు పురస్కారం

వాలంటీర్లను సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించింది. [more]

Update: 2021-04-02 00:59 GMT

వాలంటీర్లను సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించింది. సేవా వజ్రకు 30 వేలు, సేవారత్నకు ఇరవై వేలు, సేవామిత్రకు పదివేల చొప్పున నగదు అవార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాల్లో వారు అందించిన సేవలకు గుర్తుగా ఈ అవార్డులను ప్రకటించాలని నిర్ణయంచింది. ఈ నెల 13వ తేదీన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరిస్తారు.

Tags:    

Similar News