షాక్ తిన్న జగన్

Update: 2018-08-31 13:34 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మరో యవకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ త్రినాథరావు అనే యువకుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ స్పందించారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఈ సంఘటనతో షాక్ తిన్నానన్నారు. త్రినాథరావు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.

Similar News