బాలయ్య వియ్యంకుడికి జగన్ ఝలక్

నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి భూములు కేటాయిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. కృష్ణా జిల్లాలో గీతం యూనివర్సిటీ ఏర్పాటు [more]

Update: 2019-10-30 11:13 GMT

నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి భూములు కేటాయిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. కృష్ణా జిల్లాలో గీతం యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 498 ఎకరాలను కేటాయించింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమాేవశంలో ఆ భూములను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కోసం చంద్రబాబు లాలూ సంస్థకు కేటాయించిన భూమిని కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు గ్రామీణ నియోజకవర్గాల్లో వ్యవసాయ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని నిర్నయించింది. ల్యాబ్ లలో ఎరువులను పరిశీలించిన తర్వాతనే రైతులకు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అమ్మవడి పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News