ఎంజాయ్ చేస్తున్న వైఎస్ జగన్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్ ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా పాదయాత్ర, పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నికలు [more]

Update: 2019-05-03 12:32 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్ ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా పాదయాత్ర, పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఐదు రోజుల పాటు టూర్ కి వెళ్లి వచ్చిన ఆయన నిన్న రాత్రి సినిమా చూశారు. పలువురు పార్టీ నేతలతో కలిసి జగన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబీ మూవీస్ లో ‘అవేంజర్స్ ధి ఎండ్ గేమ్’ సినిమా చూశారు. ఇక, ఎన్నికల ఫలితాలకు 20 రోజులు సమయం ఉండటంతో ఆయన లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లనున్నారు. కాగా, జగన్ సినిమా చూడటం పట్ల చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్రంలో ఎప్పుడు ఉన్నారని ఇప్పుడు ఉంటారని, ప్రభుత్వం తుఫాను గురించి ఆలోచిస్తుంటే జగన్ సినిమాకు వెళ్లారని విమర్శించారు. హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం జగన్ కు భద్రత ఇస్తుందని, అందుకే జగన్ హైదరాబాద్ లో ఉంటున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News