బ్రేకింగ్ : వేగం మరింత పెంచిన జగన్

ఇంగ్లీష్ మీడియం అమలుపై జగన్ సర్కార్ వేగం పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ ప్రభుత్వం [more]

Update: 2019-11-13 12:38 GMT

ఇంగ్లీష్ మీడియం అమలుపై జగన్ సర్కార్ వేగం పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ సర్కార్ తగ్గడం లేదు. మరింత వేగం పెంచింది. ఇంగ్లీష్ మీడియం అమలుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇంగ్లీష్ మీడియం స్పెషల్ అధికారిగా వెట్రిసెల్విని నియమించింది. ఐఏఎస్ అధికారి అయిన వెట్రిసెల్వి ప్రస్తుతం ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ లో పనిచేస్తున్నారు.

Tags:    

Similar News