ఆయనను మీరే చంపేశారు..

కొండవీడులో పోలీస్ దెబ్బలతో రైతు కన్నుమూయడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్ దిగేందుకు కోటయ్య అనే [more]

Update: 2019-02-19 07:51 GMT

కొండవీడులో పోలీస్ దెబ్బలతో రైతు కన్నుమూయడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్ దిగేందుకు కోటయ్య అనే రైతు పంటను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగగా పోలీసులు రైతుపై దాడి చేశారు. దీంతో ఆ కుప్పకూలిన రైతును ఆసుపత్రికి కూడా తీసుకోకపోవడంతో కన్నుమూశాడు. ఈ ఘటనపై జగన్ తీవ్రంగా స్పందించారు. ‘‘కొండవీడులో ఒక బీసీ రైతు కోటయ్యను మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ. కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాఫ్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?’’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News