బ్రేకింగ్: వైసీపీ అభ్యర్థిని మార్చిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ సీఐ గోరంట్ల మాధవ్ భార్య సవితను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ గోరంట్ల మాధవ్ జగన్ తో [more]

Update: 2019-03-23 06:09 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ సీఐ గోరంట్ల మాధవ్ భార్య సవితను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ గోరంట్ల మాధవ్ జగన్ తో భేటీ అయ్యారు. తన బదులు తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో సవిత పేరుతో బీఫాం ఇవ్వాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి, ఈ టిక్కెట్ గోరంట్ల మాధవ్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండున్నర నెలల క్రితం ఆయన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కానీ, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. చివరకు అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ కూడా ఆయనను రిలీవ్ చేయాలని చెప్పినా చేయలేదు. గోరంట్ల మాధవ్ ఈసీని కలిసినా, ఆయనను రిలీవ్ చేయాలని ఈసీ.. డీజీపీకి సూచనలు చేసిన లాభం లేకుండా పోయింది. దీంతో చివరకు గోరంట్ల మాధవ్ పోటీ నుంచి తప్పుకొని పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారు.

Tags:    

Similar News