Ysrcp : టోల్ ప్లాజా వద్ద వైసీపీ నేతల దౌర్జన్యం… సిబ్బందికి గాయాలు

టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. విశాఖ జిల్లా పాయకరావు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం లోని [more]

Update: 2021-11-05 03:32 GMT

టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. విశాఖ జిల్లా పాయకరావు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం లోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకులు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వైసీపీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనానికి టోల్ ఫీజు చెల్లించమని సిబ్బంది కోరారు.

సిబ్బందికి గాయాలు….

అయితే ఇందుకు నిరాకరించిన వైసీపీ నేతలు టోల్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జడ్పీటీసీ వాహనాన్నే ఆపుతావా? అంటూ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘర్షణలో టోల్ గేట్ సూపర్ వైజర్ సత్యనారాయణ తలకు బలమైన గాయమయింది. దీంతో వెంటనే ఆయనను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. నిందితులు జడ్పీటీసీ సూర్యనారాయణ, జే. శ్రీను, నానాజీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News