Breaking : వైసీపీ ఎమ్మెల్సీ ముగ్గురు అభ్యర్థులు వీరే

ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన గోవింద రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లాకు చెందిన [more]

Update: 2021-11-10 14:16 GMT

ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన గోవింద రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు జరుగుతుందని త్వరలోనే ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News