జగన్ కు జై కొట్టిన మరో మాజీ ఎమ్మెల్యే

Update: 2018-05-27 08:01 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు నేతలు జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత రంగనాధరాజు పార్టీలో చేరారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి కూడా పార్టీ కండువాను కప్పుకున్నారు. చెరుకువాడ రంగనాధరాజు అత్తిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతనిధ్యం వహించారు. మొన్నటి వరకూ జిల్లా టీడీపీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. వీరి చేరికతో జిల్లాలో పార్టీ మరింత ముందుకు వెళుతుందని జగన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News