లక్కవరంలో జగన్..లక్కేంటంటే...?

Update: 2018-06-21 08:08 GMT

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఆయన తూర్పో గోదావరి జిల్లాలోని లక్కవరం నియోజకవర్గంలో 2400 కిలోమీటర్లు దాటేశారు. ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజు సందర్భంగా ఈ మైలురాయిని దాటారు జగన్. ఈ సందర్భంగా జగన్ అక్కడ మొక్క నాటారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. పెద్దయెత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చి జగన్ ను కలిసేందుకు పోటీ పడ్డారు. ఇప్పటి వరకూ 9 జిల్లాల్లో పర్యటించిన జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు జగన్ చేత కేక్ కట్ చేయించారు. ఈ వీడియో మీకోసం...తెలుగు పోస్ట్ ప్రత్యేకం....!

https://youtu.be/TCQn8cgSpF4

Similar News