నేటి నుంచి గుంటూరులో నైట్ కర్ఫ్యూ

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి నుంచి గుంటూరు నగరంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ మేరకు అధికారులు [more]

Update: 2021-04-22 01:38 GMT

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి నుంచి గుంటూరు నగరంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తారు. సాయంత్రం ఆరు తర్వాత షాపులు తెరిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రజలు సహకరించాలని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కోరారు.

Tags:    

Similar News