బ్రేకింగ్ : కాసేపట్లో వార్ రూమ్ లో కీలక నిర్ణయం....!

Update: 2018-09-26 03:49 GMT

కాసేపట్లో వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతలు భేటీ అవుతున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం గురించి కూడా చర్చించనున్నరు. వార్ రూమ్ లో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కుంతియాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. రాహుల్, సోనియా సభల తేదీల ఖరారుతో పాటు ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని, ఇలాంటి వ్యాఖ్యలను చేసిన వారిని ఉపేక్షిస్తే ప్రజల్లో పార్టీ పలుచనవుతుందని పీసీసీ క్రమశిక్షణ సంఘం కూడా నివేదికను హైకమాండ్ పంపడంతో రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. షోకాజ్ నోటీసులకు కూడా కోమటిరెడ్డి సమాధానం ఇవ్వకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంది.

Similar News