టీడీపీ నేతలను కలవని గవర్నర్

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గవర్నర్ ను కలవాలని రాజ్ భవన్ కు వచ్చిన టీడీపీ నేతలకు నిరాశ ఎదురయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్త్ రఫ్ చేయాలని [more]

Update: 2021-02-06 07:45 GMT

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గవర్నర్ ను కలవాలని రాజ్ భవన్ కు వచ్చిన టీడీపీ నేతలకు నిరాశ ఎదురయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్త్ రఫ్ చేయాలని కోరుతూ గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు వచ్చారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి వినతిపత్రాన్ని టీడీపీ నేతలు అందించారు. గవర్నర్ తమను కలవకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి ప్రజలను కలవరా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

Tags:    

Similar News