ఆ ముగ్గురిని చంద్రబాబు పార్టీ నుంచి బహిష‌్కరించాలి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కు కోవర్టులుగా టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారన్నారు. జగన్ కు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన [more]

Update: 2021-07-12 06:59 GMT

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కు కోవర్టులుగా టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారన్నారు. జగన్ కు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ తెలంగాణకు అనుకూలంగా ఉందని విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడమేంటని ప్రశ్నించారు. ఇది రాయలసీమకు ద్రోహం చేసినట్లు కాదా అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమా? పార్టీ అభిప్రాయమా? అన్నది చెప్పాలని ఆయన కోరారు.

Tags:    

Similar News