కొహ్లికి అరుదైన గౌరవం

Update: 2018-09-20 12:39 GMT

కేంద్ర ప్రభుత్వం క్రీడా అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణాచార్య అవార్డు లభించింది. విరాట్ కొహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛానుకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభించింది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కడం విశేషం. బ్యాడ్మింటన్ లో నేలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున్ అవార్డు లభించింది. 8 మందికి ద్రోణాచార్య, 20 మందికి అర్జున అవార్డులు. నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డులు లభించాయి. టెన్నిస్ లో రోహన్ బొప్పన్నకు అర్జున్ అవార్డు దక్కింది. ఆర్చరీలో సత్యదేవ్ ప్రసాద్ కు ధ్యాన్ చంద్ అవార్డు లభించింది.

Similar News