బాబు కుస్తీ అంతా దానిపైనే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తుంటే, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు కరోనా లెక్కలు వేస్తూ కుస్తీలు పడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి [more]

Update: 2020-04-07 08:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తుంటే, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు కరోనా లెక్కలు వేస్తూ కుస్తీలు పడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు జీవితమంతా ఒకరిపై బురద జల్లడమేనని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేవో అందరికీ తెలుసునన్నారు, ప్రజారోగ్యాన్ని చంద్రబాబు పక్కన పెట్టి ప్రయివేటు ఆసుపత్రులను చంద్రబాబు ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News