విజయసాయి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-05-23 08:20 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం, రమణ దీక్షితులు వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సొమ్మును అమరావతి, హైదరాబాద్ లోని ఇళ్లకు తరలించారని ఆరోపించారు. కేంద్ర విచారణ సంస్థ ద్వారా గానీ, తెలంగాణ పోలీసులతో గానీ చంద్రబాబు ఇళ్లలో సోదా జరపాలని ఆయన పేర్కొన్నారు. 12 గంటల్లోపు సోదాలు జరపకపోతే, చంద్రబాబు ఆ సొమ్మును విదేశాలకు తరలిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. 12 గంటల్లో చంద్రబాబు నివాసంలో శ్రీవారి సొమ్ము దొరకకపోతే 13వ గంటలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు.

Similar News