జగన్ ను ఈ శక్తులు అడ్డుకోలేవు

కొందరు స్వార్థంతో జెండాలు మార్చి లిటిగేటర్లుగా తయారవుతున్నారని, జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా [more]

Update: 2020-07-06 06:32 GMT

కొందరు స్వార్థంతో జెండాలు మార్చి లిటిగేటర్లుగా తయారవుతున్నారని, జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా తమకున్న మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. అయినా ఇటువంటి శక్తులేవీ జగన్ ను అడ్డుకోలేవని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే ఏమీ తినడానికి దొరకని కొందరు టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కొన్ని మిడతలు ఇప్పటికే బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయని, మరికొన్ని మిడతలు ఎగురుకుంటూ బయలుదేరాయని, ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందోనని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News