టీడీపీ ఆడిస్తున్న నాటకమే

చంద్రబాబు చేతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలుబొమ్మగా మారారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు [more]

Update: 2019-09-05 05:08 GMT

చంద్రబాబు చేతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలుబొమ్మగా మారారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని పవన్, ఇప్పుడు వైసీపీ సర్కార్ రాగానే టార్గెట్ చేశారన్నారు. ఇద్దరి మధ్య ఎన్నికలకు ముందు నుంచే సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి ఈ విషయం తెలుసునని, పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అది టీడీపీ ఆడిస్తున్న నాటకమేనని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News