వైఎస్ రాక్షసుడే.. మరోసారి మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆంధ్రపాలకులను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలను [more]

Update: 2021-06-23 05:53 GMT

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆంధ్రపాలకులను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలను చేశానన్నారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని వేముల ప్రశాంత్ రెడ్డ ప్రశ్నించారు. శ్రీకాంత్ రెడ్డి, రోజా, సోము వీర్రాజులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణకు రాక్షసుడే అని వేముల శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ నీటి దోపిడీ చేశారన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నారా లోకేష్ తెలిపారు. అక్రమ ప్రాజెక్టులను కడుతున్న ఏపీ, దానిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News