ఆ కుటుంబానికి కోటి ఇవ్వాల్సిందే

బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ [more]

Update: 2021-08-17 06:06 GMT

బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో ఒక్కొక్కిరికి కోటి రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం రమ్య విషయంలో ఎందుకు ఇవ్వదని వర్ల రామయ్య ప్రశ్నించారు. దళితులకు ఒక న్యాయం? పెద్దోళ్లకు మరో న్యాయమా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. దళిత సంఘాలతో సజ్జల బేరాలాడటం మానుకోవాలని వర్ల రామయ్య సూచించారు. రమ్య కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇవ్వకుంటే త్వరలోనే పెద్దయెత్తున ఉద్యమం చేపడతామని వర్లరామయ్య హెచ్చరించారు.

Tags:    

Similar News